English | Telugu

ఛార్మికి ఇది కూడా పాయె...

మ‌ధ్య మ‌ధ్య‌లో ఐటెమ్ సాంగులు చేసినా - లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌పైనే దృష్టి పెట్టింది ఛార్మి. పూరి తీసిన జ్యోతిల‌క్ష్మితో త‌న రేంజు పెరుగుతుంద‌ని ఆశ‌ప‌డింది. ఆ సినిమాకి పైసా పారితోషికం తీసుకోకుండా, సినిమాలో వాటా కోసం న‌టించింది. అటు పారితోషికం రాలేదు, ఇటు లాభాలూ దక్క‌లేదు. దాంతో నీర‌స‌ప‌డిపోయిన ఛార్మి - మంత్ర 2పై ఆశ‌లు పెట్టుకొంది.

మంత్ర సినిమా ఛార్మి కెరీర్‌లో ఓ మైలు రాయి. ఆ సినిమాతో తొలి నంది అవార్డు కూడా అందుకొంది. మ‌ళ్లీ త‌న‌కు పూర్వ వైభ‌వం తెస్తుంద‌నుకొన్న మంత్ర 2 శుక్ర‌వారం విడుద‌లై... దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకొంది. ఈ సినిమాలో విష‌యం లేద‌ని విమ‌ర్శ‌కులు తేల్చేశారు. అంతేనా.. అంటే న‌టిగా ఛార్మి కి మైన‌స్ మార్కులు కూడా వేశారు. ఛార్మి కెరీర్లో ఇంత పూర్ గా న‌టించిన సినిమా ఏదీ లేద‌ని ఏకిపడేశారు. దాంతో ఛార్మి ఆఖ‌రి ఆశ కూడా అడియాశ అయిపోయింది.

ఇప్పుడు ఛార్మి చేతిలో సినిమాలేం లేవు. పోనీ ఇది వ‌ర‌క‌టిలా ఐటెమ్ పాట‌లైనా చేస్తుంద‌నుకొంటే `నేను ఐటెమ్ పాట‌లు చేయ‌నుగాక చేయ‌ను` అంటూ ఈమ‌ధ్య ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ప్ర‌త్యేక గీతాలొస్తే వ‌దులుకోదేమో. ఎందుకంటే ఏదోలా గెటిన్ అయిపోవాలిగా. ఛార్మింగ్ ఛార్మికి ఛార్జింగ్ ఇచ్చేది ఇప్పుడు ఐటెమ్ గీతాలొక్క‌టే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.