English | Telugu

మే 20 నుండి మహేష్, పూరీ "ది బిజినెస్ మేన్"

మే 20 నుండి మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ "ది బిజినెస్ మేన్" చిత్రం ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ "ది బిజినెస్ మేన్" చిత్రానికి "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్" అనే క్యాప్షన్ ని నిర్ణయించారు. ఈ "ది బిజినెస్ మేన్" చిత్రంలో హీరో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది. గతంలో మహేష్ బాబు హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "పోకిరి" చిత్రం ఊహించని రేంజ్ లో హిట్టయి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

అందుకని మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో రాబోయే ఈ "ది బిజినెస్ మేన్"చిత్రం మీద అత్యంత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మహేష్, పూరీ "ది బిజినెస్ మేన్" చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రామ్ గోలా వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ "ది బిజినెస్ మేన్" చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించనున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.