English | Telugu

అభిమానుల్ని క‌ల‌వ‌ర పెడుతున్న మ‌హేష్ కామెంట్స్‌

ఈమ‌ధ్య మ‌హేష్‌బాబు "క్లాస్" నే నమ్ముకున్నట్టు అనిపిస్తోంది .. కుటుంబ క‌థ‌లు, స్టైలీష్ పాత్ర‌లూ ఎంచుకొంటున్నాడు. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఎఫెక్టేమో అది. ఆ త‌ర‌వాత వ‌న్ - నేనొక్క‌డినే లో స్టైలీష్ క్యారెక్ట‌ర్ చేశాడు. ఇప్పుడు శ్రీ‌మంతుడులో అటు స్టైల్‌నీ, ఇటు ఫ్యామిలీని మిక్స్ చేశాడు. అందుకే త‌న కెరీర్‌లో ఎప్పూడూ ప‌డ‌లేనంత టెన్ష‌న్ ఈ సినిమా కోసం ప‌డుతున్నా అంటున్నాడు మ‌హేష్‌. గ‌త సినిమాలకంటే ఇందులో పాత్ర చాలా భిన్నంగా ఉంటుంద‌ని, ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో అర్థం కావ‌డం లేద‌ని మ‌హేష్ చెబుతున్నాడు. మాస్ పాత్ర‌ల‌కు గ్యారెంటీ ఉంటుంద‌ని, అల‌వాటు ప‌డిన పాత్ర‌ల్ని ఆడియ‌న్స్ కూడా త్వ‌ర‌గా రిసీవ్ చేసుకొంటార‌ని అయితే శ్రీ‌మంతుడు ఆ టైపు పాత్ర కాద‌ని చెబుతున్నాడు. సినిమా సినిమాకీ ప్రేక్ష‌కులు అంచ‌నాలు పెంచుకొంటున్నార‌ని, వాటిని అందుకోవ‌డం ఓ స‌వాల్ అని - శ్రీ‌మంతుడుతో ఓ డిఫ‌రెంట్ క‌థ‌నీ, డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌నీ ట్రై చేశాన‌ని అభిమానులు ఆద‌రించాల‌ని కోరుతున్నాడు మ‌హేష్‌.

ఏదైమైనా ఆడియో ఫంక్ష‌న్ లో మ‌హేష్‌లో క‌నిపించిన కాన్ఫిడెన్స్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఈసారి హిట్టుకొడ‌తా అన్న ధీమా అత‌ని మాట‌ల్లో క‌రువైంది. అదే అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. మ‌హేష్‌లాంటి ఓ స్టార్‌..సినిమా విడుద‌ల ముందు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డం... షాకిచ్చే విష‌య‌మే. ఈ సినిమాని లోప్రొఫైల్‌లో విడుద‌ల చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడా, లేదంటే నిజంగానే మ‌హేష్‌కి ఈ సినిమాపై అనుమానాలున్నాయా అనే విష‌యంలో సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ తిక‌మ‌క‌ప‌డుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.