English | Telugu

వచ్చేనెలలో వస్తున్న ‘అల్లుడు శీను’


నిర్మాతల కొడుకులు పరిశ్రమకు హీరోలుగా పరిచయమవడం తెలుగు పరిశ్రమలో ఎప్పటినుంచో వస్తున్న ట్రెండ్. ఈ కోవలో తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్తనయుడు సాయిశ్రీనివాస్‌ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ‘అల్లుడు శీను’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 29న ఈ చిత్ర ఆడియోని కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. తాను పరిచయం చేసిన దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో తన తనయుడు తొలిచిత్రం రూపుదిద్దుకోవడం ఆనందంగా వుందని సురేష్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, కెమెరా చోటా కే. నాయిడు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.