English | Telugu

లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ కన్నుమూత

క్లాసిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్(92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా. రేపల్లె సమీపంలోని పెద పులివర్రు అనే గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. చెన్నై లోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'ఆత్మ గౌరవం'(1966) సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమానే రెండు నంది అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత 'శంకరాభరణం', 'స్వాతి ముత్యం', 'సాగర సంగమం', 'సప్తపది' వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించి తెలుగు సినిమాకు గౌరవాన్ని తెచ్చిన దర్శకుడిగా పేరు పొందారు.

తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన గొప్ప సినిమాలలో 'శంకరాభరణం'(1980) ముందు వరుసలో ఉంటుంది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది, అఖండ విజయం సాధించడమే కాకుండా.. జాతీయ పురస్కారం సైతం గెలుచుకుంది. 'సప్తపది' సినిమా నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం అవార్డు అందుకుంది. 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం', 'శృతిలయలు', 'స్వరాభిషేకం' చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. దర్శకుడిగా 50 కి పైగా సినిమాలు చేసిన విశ్వనాథ్ నటుడిగానూ రాణించారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్ వంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. సినిమారంగంలో చేసిన కృషికిగాను 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారం, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారం, 2016 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 92 ఏళ్ల కె. విశ్వనాథ్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 'శంకరాభరణం' విడుదలైన రోజే ఫిబ్రవరి 2న తుదిశ్వాస విడిచారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.