English | Telugu

ఇప్పటి సినిమాలకు కథ కాకరకాయ లేదంట

'పోకిరి', 'మగధీర', 'మిర్చి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. 'మగధీర' వంటి సినిమాలు కొన్ని టాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టాయి. ఇవన్నీ కూడా ఇపుడున్న కాలాన్ని అనుసరించి వస్తున్న చిత్రాలు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో కథ లేదు కాకరకాయ లేదంటున్నారు సినీ నిర్మాత కెఎస్ రామారావు. ఆయన స్థాపించిన "క్రియేటివ్ కమర్షియల్స్" సంస్థ 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అంతే కాకుండా ఇపుడు వస్తున్నా సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి అయితే మాత్రం బాగాలేదు అని అన్నారు. 1981లో 'మౌనగీతం' సినిమాతో నిర్మాతగా మారాను. అ తర్వాత చిరంజీవితో 'అభిలాష' తీసాను. అప్పటినుంచి ఇప్పటివరకూ అశ్లీలం, ద్వంద్వార్ధ సంభాషణలకు ఆస్కారం లేకుండా కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చాం. ఇక మీదట కూడా మా నుంచి అలాంటి సినిమాలే వస్తాయి" అని తెలిపారు.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.