English | Telugu

నాగార్జున పై అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్

-నాగార్జున పై కొండ సురేఖ సంచలన ట్వీట్
-అభిమానుల ఆగ్రహం
-క్షమాపణలు చెప్పిన సురేఖ
-నాగార్జున నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ఏడున్నర దశాబ్దాల సినీ జీవితం లెజండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు(ANR)సొంతం. అంటే తెలుగు సినిమా కూడా ఆ మహానటుడు తో ప్రయాణాన్ని మొదలు పెట్టిందని చెప్పవచ్చు. అయన వారసుడుగా కింగ్ నాగార్జున తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటు ఒక ఎరా ని సృష్టించుకొని లక్షలాది మంది అభిమానులని సంపాదించాడు. స్టూడియో అధినేతగా కూడా తెలుగు చిత్ర పరిశమ్రకి ఎన్నో సేవలందిస్తూ వస్తున్నాడు. కొన్నినెలల క్రితం నాగార్జున(Nagarjuna)ఆయన మాజీ కోడలు సమంత(Samantha)ని ఉద్దేశిస్తు తెలంగాణ రాష్ట్రమంత్రి కొండా సురేఖ'(KOnda Surekha) వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు పెద్ద సంచలనం సృష్టించడంతో పాటు అక్కినేని అభిమానుల్లో ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి .

రీసెంట్ గా కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ లో నాగార్జున, ఆయన ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం నాకు ఎక్కడ లేదు. నా వ్యాఖ్యల వల్ల నాగార్జున ఫ్యామిలీ బాధపడి ఉంటే, అందుకు చింతిస్తూ నా వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన ఈ క్షమాపణ పోస్ట్ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే.

aslo read: ది గర్ల్ ఫ్రెండ్ నాలుగు రోజుల కలెక్షన్స్! పెరిగాయా, తగ్గాయా!

ఈ కేసుని సంబంధించి ఇప్పటికే కొన్నిసార్లు నాగార్జున అండ్ ఫ్యామిలీ కోర్టు కి హాజరయ్యింది. మరి ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో నాగార్జున తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .