English | Telugu

వారం పాటు ఏం తినలేదు.. బాలకృష్ణ తో పెట్టుకుంటే అదే పరిస్థితి 

ఐదు దశాబ్దాల నుంచి నటనని తన ఊపిరిగా చేసుకుంటూ వస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ(balakrishna)పేరుకి ఎన్టీఆర్(ntr)వారసుడు అనే కానీ వారసత్వపు ఛాయలు పడకుండా తన కంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. బడా హీరోలు సైతం బాలయ్య చెప్పినట్టుగా డైలాగ్ ని మేము చెప్పలేమని అంటారంటే సినిమా పట్ల బాలయ్య డిక్షనరీ ని అర్ధం చేసుకోవచ్చు. మరి అలాంటి నట సింహం గురించి అగ్ర దర్శకుడు కోదండ రామిరెడ్డి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి.

బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబో లో మొత్తం 13 చిత్రాలు తెరకెక్కాయి. అనసూయమ్మ గారి అల్లుడు ఫస్ట్ మూవీ. విడుదలైన అన్ని చోట్ల ఘన విజయాన్ని సాధించి ఆ ఇద్దరి కాంబో ని రిపీటెడ్ కాంబో గా చేసింది. దీంతో బాలయ్య అభిమానులు ప్రేక్షకులు కూడా ఎన్నో భారీ అంచనాలతో ఆ ఇద్దరి మూవీ కోసం చూస్తుండే వాళ్ళు. ఈ క్రమంలో 1993 లో వచ్చిన మూవీ నిప్పురవ్వ(nippu ravva)ఈ సినిమా విషయంలోనే కొండరామిరెడ్డి బాలయ్య మీద కొన్ని వ్యాఖ్యలు చేసాడు. హీరో పాత్ర నిరాహార దీక్ష చేసే సీన్ ఒకటి ఉంటుంది. కొన్ని రోజుల పాటు ఏం తినకుండా ఆ దీక్ష కొనసాగుతుంది. దీంతో నీరసం వచ్చి హీరో ఫేస్ డల్ గా కనపడాలి. సినిమా కాబట్టి కెమెరా తో మ్యానేజ్ చెయ్యవచ్చు. కానీ బాలయ్య మాత్రం ఒప్పుకోలేదు. నిజంగానే వారం రోజుల పాటు ఏం తినకుండా కేవలం జ్యూస్ లు లాంటివి మాత్రమే తీసుకొని ఆ సీన్ ని పూర్తి చేసాడని కోందండ రామిరెడ్డి చెప్పారు.

అలాగే బాలయ్య గురించి మరికొన్ని విషయాలని కూడా చెప్పారు.బాలయ్య కి అగ్ర నటుడు అనే గర్వం ఉండదని, ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తాడని అదే విధంగా గోల్డెన్ స్పూన్ తో పుట్టాననే గర్వం కూడా లేదని చెప్పుకొచ్చారు. అలాగే సినిమా అంటే బాలయ్య కి విపరీతమైన పిచ్చి అనే విషయాన్నీ కూడా వెల్లడి చేసారు. భలే దొంగ, నారి నారి నడుమ మురారి ,ధర్మక్షేత్రం,రక్తాభిషేకం,తిరగబడ్డ తెలుగుబిడ్డ,భానుమతి గారి మొగుడు, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు,ముద్దుల మొగుడు, యువరత్న రాణా వంటి చిత్రాలు వచ్చాయి.దాదాపుగా అన్ని కూడా విజయంతమైన చిత్రాలే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.