Read more!

English | Telugu

తన డైరెక్టర్లనే వారసులకు ప్రిఫర్ చేస్తున్న నాగార్జున

తనయుల కెరీర్ల కోసం కింగ్ నాగార్జున కొత్త దారిని ఫాలో అవుతున్నారు. అఖిల్ మొదటి సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో రెండో సినిమా కోసం చాలా కసరత్తు చేసిన నాగ్, ఇప్పుడు డైరెక్టర్ ను ఫిక్స్ చేశారట. నాగ చైతన్య తర్వాతి సినిమాకు ' సోగ్గాడే.. ' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ను కేటాయించిన నాగ్, అఖిల్ తర్వాతి సినిమాను ' ఊపిరి ' డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతిలో పెడదామనుకుంటున్నాడట. ఎమోషనల్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించి, హీరో పెర్ఫామెన్స్ ను ఎలివేట్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు వంశీపైడిపల్లి. ఊపిరి చూసుకున్న తర్వాత, అఖిల్ కు వంశీ అయితేనే కరెక్ట్ హిట్ ఇవ్వగలడనే ఒపినీయన్ కు కింగ్ వచ్చేశాడట. మీడియాతో మాట్లాడుతూ, సినిమాపై అఖిల్, వంశీ చర్చించుకుంటున్నారని, త్వరలోనే వాళ్లిద్దరి కాంబోలో మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉందని రివీల్ చేశాడు. అన్నపూర్ణ బ్యానర్లోనే, ఎమోషనల్ లవ్ స్టోరీగా అఖిల్ రెండో సినిమా వచ్చే అవకాశం ఉంది.