English | Telugu

పెళ్లి అయితే తగ్గాలా..కుర్రకారు మతి పోగొడుతున్న నటి 

ఆ అమ్మడు తెలుగులో అగ్ర హీరోలు అయిన మహేష్ బాబు,రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా చేసింది. అలాగే మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ తో రెండో సారి జత కట్టింది .హిందీ లో కూడా పలు సినిమా లు చేసిన ఆ అమ్మడికి సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. అందానికి అందం నటనకి నటన అనే పేరుని కూడా సంపాదించింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆ అమ్మడు అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ ఫోజులు ఇవ్వడం అటు టాలీవుడ్ లోను ఇటు బాలీవుడ్ లోను సంచలనం సృష్టిస్తుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు కియారా అద్వానీ.

కియారా అద్వానీ..తెలుగులో తళుక్కున మెరిసిన తార.భరత్ అనే నేను,వినయ విధేయ రామ సినిమాల్లో సూపర్ గా నటించడమే కాకుండా గ్లామర్ ప్రదర్శించే విషయం లో కూడా మంచి మార్కులు కొట్టేసింది. కియారా ముఖం కోహినూర్ డైమండ్ లాగ చాల క్యూట్ గా మెరిసిపోతుంటుంది. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన హిందీ అర్జున్ సింగ్ లో కియారా సూపర్ గా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. అలాగే షేర్షా,జగ్ జుగ్ జియా, తదితర సినిమాలు కూడా చేసింది. సినిమా కెరీర్ పీక్ గా ఉన్న టైం లోనే ప్రముఖ హీరో సిద్దార్ధ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అందరు ఇంక కియారా అంద చందాలని మిస్ అవుతామని భావించారు. కానీ కియారా తన గ్లామర్ డోస్ ని పెంచుతుందని ఎవరు ఊహించలేదు.

ఇక అసలు విషయానికి వస్తే..కియారా తాజాగా ఫెమినా మ్యాగజైన్ కి కొన్ని ఫోజులు ఇచ్చింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కియారా మూడు కలర్ డ్రెస్సులతో ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకారు ఫ్యూజులు మొత్తం పోయాయి. సిల్వర్ కలర్ డ్రెస్ లో ఎద అందాలని, గ్రీన్ కలర్ డ్రెస్ లో నడుపు వంపులను, వైట్ కలర్ డ్రెస్ లో హాట్ నెస్ ను ఇలా మూడు విభిన్న డ్రెస్ లలో కియారా తన ఒంపు సొంపులని ప్రదర్శించి పెళ్లి అయ్యిన కూడా కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది.

కాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో లు బయటకి వచ్చినప్పటినుంచి అమ్మ కియారా పెళ్లి అయ్యాక కూడా మరి ఈ ఎక్సపోజింగ్ ఏంటి కొంచం తగ్గచ్చుకదా నీ భర్త ఏమైనా అనుకుంటాడేమో అని కియారా కి సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కియారా ఫోటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.