English | Telugu

ప్రభాస్ రాముడిలా కాదు కర్ణుడిలా కనిపిస్తున్నాడు!

'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ ని చూస్తుంటే రాముడిలా కనిపించడం లేదని, కర్ణుడిలా కనిపిస్తున్నాడని నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండగా, ప్రభాస్ అభిమానులు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు.

రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో టి.సిరీస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించిన తీరుని కొందరు తప్పుబట్టారు. రాముడికి మీసాలు, గడ్డలు ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా కస్తూరి సైతం ఇదే అభిప్రాయపడ్డారు. రామలక్ష్మణులను మీసాలు, గడ్డాలతో చూపించిన సంప్రదాయం ఎక్కడైనా ఉందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రను అద్భుతంగా పోషించిన లెజెండ్స్ ఉన్నారు.. కానీ 'ఆదిపురుష్'లో ప్రభాస్‌ రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు అంటూ కస్తూరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.