English | Telugu

కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ ఊచకోత.. ఫస్ట్ వీకెండ్ లోనే 300 కోట్లు!

2022లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ గా రూపొందిన మూవీ 'కాంతార చాప్టర్ 1'. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. (Kantara Chapter 1)

'కాంతార చాప్టర్ 1' సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టింది. సినిమాకి పాజిటివ్ రావడంతో అదే జోరుని కొనసాగిస్తూ.. భారీ వసూళ్లు రాబడుతోంది. ట్రేడ్ వర్గాల రెండో రోజు రూ.61 కోట్లు, మూడో రోజు రూ.81 కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే మూడు రోజుల్లోనే రూ.231 కోట్ల గ్రాస్ సాధించింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో రూ.80 కోట్ల దాకా రాబట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మొదటి వీకెండ్ లోనే రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది.

2022లో వచ్చిన 'కాంతార' చిత్రం ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' మొదటి నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరుతుంది. మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.