English | Telugu
హీరోయిన్ కి చీర పంపించిన అభిమాని
Updated : Apr 5, 2025
ప్రభాస్(Prabhas)తో ఏక్ నిరంజన్ మూవీలో జోడి కట్టిన కంగనా రనౌత్(Kangana Ranaut)ఆ తర్వాత బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.ఈ ఏడాది జనవరిలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(Indira Gandhi)ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు సంభవించిన 'ఎమర్జెన్సీ' పరిస్థితుల ఆధారంగా చేసుకొని తెరకెక్కిన 'ఎమర్జన్సీ'(Emergency)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన స్వీయ దర్శకత్వంలోనే కంగనా నిర్మించగా టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించి అభిమానుల మన్ననలు పొందింది.
ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అవుతు ఉంది.నిత్యానందం అనే వ్యక్తి ఎమర్జెన్సీ చిత్రాన్ని చూసి 'కంగనా'నటనని మెచ్చుకోవడమే కాకుండా,పవర్ ఫుల్ సబ్జెట్ ని ఎలాంటి బెరుకు లేకుండా చూపించినందుకు కంగనాకి తన అభినందనలు తెలపడంతో పాటు కాంచి పురం చీరని బహుమతిగా కూడా పంపించాడు.ఇనిస్టా వేదికగా ఈ విషయాన్నీ షేర్ చేసిన కంగనా 'ఎమర్జెన్సీ రూపొందించినందుకు అద్భుతమైన చీరని బహుమతిగా పొందాను.పనికి మాలిన ట్రోఫీల కంటే ఈ చీర ఎంతో ఉత్తమమైనదని తెలిపింది.
బాలీవుడ్(Bollywood)లో ఇచ్చే అవార్డుల గురించే కంగనా అలాంటి వ్యాఖ్యలు చేసిందనే విషయాన్నీప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె గతంలోను బాలీవుడ్ ఇచ్చే అవార్డులపై మాట్లాడుతు అర్హులకి అవార్డులివ్వరని,బందుప్రీతికే మొగ్గు చూపిస్తారని చెప్పుకొచ్చింది.కంగనా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ(Bjp)తరుపున హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి'(mandi)పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.