English | Telugu

కళ్యాణ్‌రామ్ ‌‘పటాస్‌’ టైటిల్‌ లోగో

'అతనొక్కడే’ నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పటాస్‌’. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను ఈరోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

సాయి కార్తీక్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 7న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. డిసెంబర్‌ నెలలోనే చిత్రాన్ని కూడా వరల్డ్‌వైడ్‌గా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.క్రిష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎస్‌.జె.ఫణికుమార్‌, చీఫ్‌`కోడైరెక్టర్‌: సత్యం, కో`డైరెక్టర్స్‌: ఎస్‌.క్రిష్ణ, మహేష్‌ ఆలంశెట్టి, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.