English | Telugu

అసలేం జరుగుతోంది - కాజల్ అగర్వాల్

"అసలేం జరుగుతోంది" అని కాజల్ అగర్వాల్ అంటూంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ పై సౌతిండియన్ సినిమా వారు బ్యాన్ పెట్టబోతున్నారట. మొన్నామధ్య సినీ నటి కాజల్ అగర్వాల్ "సింఘం" అనే ఒక హిందీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో దక్షిణాది సినిమా వారిని మీడియాలో కించపరిచే విధంగా మాట్లాడిందనీ, అందుకామె మీడియాకు క్షమాపణ చెప్పాలనీ, లేకుంటే ఆమె దక్షిణాది సినిమాల్లో నటించటానికి వీల్లేదనీ వినపడింది. నిజానికి కాజల్ అగర్వాల్ సినీ నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది బాలీవుడ్ లోనే అయినా ఆమె నటనంటే నేర్చుకుందీ, పేరు ప్రఖ్యాతులూ, డబ్బూ సంపాదించుకుంది మాత్రం దక్షిణాది సినిమాల్లోనే అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఆమె ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది. అలాంటిది కాజల్ అగర్వాల్ దక్షిణాది సినీపరిశ్రమపైనే విమర్శనాస్త్రాలను సంధించటం మనవాళ్ళకి మింగుడుపడలేదు. ఈ విషయంపై ప్రముఖ తమిళ హీరో సూర్య కూడా ఘాటుగా స్పందించాడు. ఏ సినీ పరిశ్రమ పైకి తెచ్చిందో మర్చిపోయి, ఒక్క సినిమా అవకాశం రాగానే బాలీవుడ్ ని పొగుడుతూ, సౌతిండియన్ సినీ పరిశ్రమను విమర్శించటం కాజల్ కు భావ్యం కాదని ఆయన అన్నారు. ఇవన్నీ విన్న తర్వాత కాజల్ స్పందిస్తూ "అసలేం జరుగుతోంది. నేనేమన్నానూ...మీడియా ఏం రాసింది. అన్నది తెలుసుకోకుండా నాపై విమర్శలు కురిపించటం భావ్యం కాదు" అని ఆమె అంటూంది. నిలకడ మీద కదా నిజం తెలిసేది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.