English | Telugu

ఎన్టీఆర్ చేసిన పని ఆలస్యంగా వెలుగులోకి.. టాలీవుడ్ లో హాట్ టాపిక్!

ఇటీవల ఓ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి స్వల్ప గాయమైందని, వైద్యుల సూచన మేరకు రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారని ఆ ప్రకటనలో ఉంది. దీంతో ఎన్టీఆర్ ఆరోజు నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడొక సంచలన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లో కొడుతోంది.

యాడ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో ప్రత్యేక సెటప్ చేశారట. ఎన్టీఆర్ కి గాయం కాకుండా ఉండుంటే, ఆ రోజు షూటింగ్ పూర్తయ్యేది. కానీ, అనుకోకుండా ఆయన గాయపడి రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ రెండు వారాలు స్టూడియోలో సెటప్ అలాగే ఉంచితే.. రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే యాడ్ మేకర్స్ కి అదనపు భారం కాకూడదని భావించిన ఎన్టీఆర్.. నొప్పితోనే ఆ మరుసటి రోజు వెళ్ళి, షూటింగ్ ని పూర్తి చేశాడట. ఎన్టీఆర్ డెడికేషన్ చూసి టీం ఫిదా అయిందట.

సినీ సెలబ్రిటీలు హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఏదైనా చిన్న గాయమైతే విశ్రాంతి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం.. తన వల్ల అదనపు భారం పడకూడదని, నొప్పితోనే యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. దీంతో ఎన్టీఆర్ పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.