English | Telugu

జీన్స్ సీక్వెల్ కు రంగం సిద్ధం...!

ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జీన్స్". 1998 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తుంది. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఈ సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఇటివలే చెన్నై ఫిల్మ్ చాంబర్ లో"జీన్స్-2" అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.