Read more!

English | Telugu

హీరో శింబు పోలీసులకు లొంగిపోయాడు..!!

 

తమిళ హీరో శింబు పోలీసులకు లొంగిపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో కలిసి ఆయన చేసిన బీప్ సాంగ్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ పై కంప్లైట్లు రావడంతో, పోలీసులు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. స్త్రీలను కించపరిచేలా ఈ పాట ఉందంటూ మహిళా సంఘాలు బీప్ సాంగ్ పై పెద్ద గొడవలే చేశాయి. అనురుథ్ ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాన శింబు మాత్రం కోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడా పోలీసులకు వివరణ ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

దీంతో కోర్టు ఆదేశానుసారం, శింబు కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. తండ్రి టి. రాజేందర్ తో పాటు, న్యాయవాది ఆయన వెంట వచ్చారు. పోలీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చేశారు.  వెళ్లేముందు, అంతా దేవుడు చూసుకుంటాడని శింబు వైరాగ్యంతో మాట్లాడారు. పోలీసులతో ఈ బీప్ సాంగ్ వివాదంలో తనకేం సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం.