English | Telugu

హార్ట్ ఎటాక్ పని అయిపొయింది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్వరగా సినిమా పూర్తి చేసే ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్. ఈయన ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో ఎప్పుడు ముగించేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ కేవలం మూడు నెలలలోపే సినిమాను పూర్తి చేయడం ఈయన ఒక్కడికే చెల్లింది. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో "హార్ట్ ఎటాక్" అనే చిత్రం రూపొందుతుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ గోవాలో పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను కూడా అతి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.