Read more!

English | Telugu

అదును చూసి దెబ్బ కొట్టిన హరిహరవీరమల్లు నిర్మాత.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో  

 

రాననుకున్నారా! రాలేననుకున్నారా! ఇంద్ర మూవీలో మెగాస్టార్ చిరంజీవి  చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఈ డైలాగ్ ని  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. హరిహర వీరమల్లు రూపంలో సగర్వంగా చెప్పబోతున్నాడు 

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు  ఒకటి. 2022 లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రక రకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వచ్చింది.పైగా ఆ మూవీ  తర్వాత  పవన్ ఒప్పుకున్న  సినిమాలు విడుదల అయ్యాయి. అసలు వీరమల్లు గురించి  అప్ డేట్ కూడా ఎక్కడా రావడం లేదు.మేకర్స్ కూడా సైలెంట్ గా ఉంటు వస్తున్నారు. దీంతో   వీరమల్లు ఇప్పట్లో  ఉండదనే వార్తలు గత కొంత కాలం నుంచి వినిపిస్తు వస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ అదును చూసి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. వీరమల్లు టీజర్ మే  2  ఉదయం తొమ్మిది గంటలకి  విడుదల కాబోతుంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో  మేకర్స్ అధికారకంగా  ప్రకటించారు.దీంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది

మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏ ఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో వీరమల్లు ని నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడంతో ప్రాజక్టు పై అందరిలో ఎనలేని  ఆసక్తి నెలకొని ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా  అషు రెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాటు ఎన్నో భారీ చిత్రాలకి మాటల్ని     అందించిన  సాయి మాధవ్ బుర్ర వీరమల్లు కి కూడా  డైలాగ్స్ ని అందిస్తున్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు