English | Telugu

చాలా థాంక్స్.. ఇక నుంచి సినిమా వాళ్ళు వాటికి ప్రమోషన్ చెయ్యరు

తెలుగు, హిందీ, తమిళ సినిమాలని రహస్యంగా రికార్డ్ చేసి, ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మకాలు జరుపుతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పైరసీ ముఠాని రీసెంట్ గా హైదరాబాద్(Hyderabad Police)పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఐదుగురు కీలక నిందితులని అరెస్టు చెయ్యడంతో పాటు, వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలని స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయంపై రీసెంట్ గా ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్ రాజు'(Dil Raju)మాట్లాడుతు పైరసీ భూతగాళ్ళని పట్టుకున్న హైదరాబాద్‌ పోలీసులకి ధన్యవాదాలు, టెక్నాలజీతో పాటు నేరాలూ పెరుగుతున్నాయి. పైరసీతో ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం కలుగుతోంది. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా చేయాలని సీఎం అన్నారు. ఇకపై సినీ పరిశ్రమ నుంచి ఎవరు బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ చేయరని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ప్రస్తుతం నిర్మాతగా తన హవా కొనసాగిస్తూనే పంపిణి దారుడిగాను పలు హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందిస్తున్నాడు. రీసెంట్ గా 'ఓజి'(OG)ని తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర లో దిల్ రాజు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.