English | Telugu

దీనస్థితిలో టాలీవుడ్ స్టార్ కమెడియన్.. పట్టించుకోని స్టార్స్!

'దుబాయ్ శీను' సినిమాలో హోటల్ సీన్ లో "ఏం తీసుకుంటారు" అని వేణుమాధవ్ అడగ్గానే.. "మూడు ఊతప్ప, ఒక రవ్వ దోస, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ" అంటూ కమెడియన్ రామచంద్ర చెప్పిన తీరు భలే ఉంటుంది. ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. అంతలా నవ్వించిన రామచంద్ర.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమై, సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా లాంచ్ అయిన 'నిన్ను చూడాలని' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రామచంద్ర. ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, లౌక్యం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలు రామచంద్రకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన రామచంద్ర.. గత పదేళ్లుగా పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఒకటి అరా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

రీసెంట్ గా రామచంద్ర ఓ డెమో షూట్ లో పాల్గొనగా.. సడెన్ గా కాలు, చేయి నొప్పి రావడంతో మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశారట. అనంతరం డాక్టర్ ని సంప్రదించగా.. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిసింది. ఆ క్లాట్ వల్ల పెరలాసిస్ ఎటాక్ కాగా.. ఎడమ చేయి, ఎడమ కాలు పడిపోయాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం రామచంద్ర విశ్రాంతి తీసుకుంటూ.. ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారు.

తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు రామచంద్ర. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చయిందని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ కావడంతో కొంత కవర్ అయిందని తెలిపారు. అయితే ట్రీట్మెంట్ కోసం మరిన్ని డబ్బులు అవసరమని.. ఇప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని పేర్కొన్నారు. ఎవరైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకైతే సినీ పరిశ్రమ నుంచి తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆరా తీయలేదని రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రామచంద్ర పలువురు స్టార్ల సినిమాల్లో నటించారు. మరి ఎవరైనా స్టార్ ముందుకొచ్చి.. ఆయన ట్రీట్మెంట్ కి కావాల్సిన ఆర్ధిక సాయం అందిస్తారేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.