Read more!

English | Telugu

ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్న చిరంజీవి.. ఇక సన్మానమే తరువాయి 

మెగాస్టార్  చిరంజీవి(chiranjeevi)ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు. ఏం సాధించారు అని చెప్పడం స్టార్ట్ చేస్తే ఒక్కసారిగా అందరు నోరెళ్లెబెట్టి చెప్పే వాళ్ళ వైపే చూస్తుంటారు. పైగా చెప్పడం  పూర్తి అయిన తర్వాత ఇవన్నీ మాకు చిన్నప్పుడే తెలుసు  ఎక్స్ క్లూజివ్ గా  ఏమైనా ఉంటే  చెప్పమని అంటారు.  కాబట్టి  చిరు  ఎక్స్ క్లూజివ్ వార్త లేటు లేకుండా చూద్దాం.

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్రీడల మహోత్సవం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన ఆరంభ వేడుకలకి చిరంజీవి ఆయన శ్రీమతి సురేఖ, రామ్ చరణ్(ram charan)ఉపాసన(upasana)క్లీంకార(klin kaara)పాల్గొన్నారనే విషయం అందరకి తెలిసిందే. లేటెస్ట్ గా  తన  ఎక్స్  వేదికగా సురేఖ తో కలిసి దిగిన ఒక ఫోటోని చిరు షేర్ చేసాడు. ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న చోట చిరు తన  చేతిలో ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని  పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు కూడా చేసాడు. ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా సురేఖ తో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతి రూపాన్ని పట్టుకోవడం కూడా చాలా సంతోషకరమైన క్షణం.

అదే విధంగా పోటీలో పాల్గొంటున్న మన దేశ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం తో పాటు పతకాలు తీసుకురావాలని కూడా అభిలషించారు. ఇక చిరు ట్వీట్ చూసిన అభిమానులతో పాటు సాధారణ ప్రజానీకం మొత్తం ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఇండియా ఏ క్రీడలో పతకం గెలిచినా కూడా చిరు వాళ్ళని తన ఇంటికి పిలిచి సన్మానించడం గ్యారంటీ అని అంటున్నారు.  ఇక  సినిమాల విషయానికి వస్తే  ప్రస్తుతం విశ్వంభర లో చేస్తున్నాడు. నెక్స్ట్ జనవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.