English | Telugu
‘ఈసారి నన్ను తప్పకుండా కలవండి..’ అభిమానిని రిక్వెస్ట్ చేసిన అనసూయ!
Updated : Jul 27, 2024
అనసూయ గతంలో టీవీ షోలతో బిజీగా ఉండేది. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది. అయినా సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్లోనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలను కూడా వారితో షేర్ చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు వివాదాలు చోటు చేసుకున్నా వాటిని కూడా క్లారిఫై చేస్తుంటుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన పట్ల అనసూయ తన బాధను వ్యక్తం చేసింది. అదేమిటంటే.. ఒక అభిమాని తనను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు వచ్చాడట. కానీ, అది కుదరక వెళ్లిపోయాడట. దాంతో ఆ అభిమానిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది అనసూయ. అదేమిటో తెలుసుకుందాం.
అనసూయ ఈమధ్యకాలంలో సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. అందులో ‘సింబా’ చిత్రం విడుదలకు వచ్చింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ ఈవెంట్లో అనసూయ పాల్గొంది. అందులో భాగంగానే మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని తనకు పెట్టిన ట్వీట్పై స్పందించింది. అనసూయను సింబా ఈవెంట్కి వచ్చినపుడు ఆ అభిమాని చూశాడట. ఆమెను చూడడం అది రెండోసారట. చూశాను. అంతేచాలు అని ట్వీట్ చేశాడు. దానికి అనసూయ స్పందిస్తూ అయ్యో మరి నన్ను కలవొచ్చు కదా అని అడిగింది. ట్రై చేశాను. కానీ, కుదరలేదు. లంచ్ టైమ్ దాటిపోతున్నా ఓపికగా మీరు మీడియాలో మాట్లాడడం చూశాను. లైవ్లో మిమ్మల్ని చూశాను. చాలు అనుకున్నాను అంటూ అతను సమాధానమిచ్చాడు. దానికి మరోసారి స్పందిస్తూ ‘ఈసారి వస్తే మాత్రం దయచేసి నన్ను కలవండి. అనుక్షణం నాతో ఒక ఆర్మీలా ఉంటూ నన్ను రక్షిస్తున్న మీలాంటి అభిమానుల్ని కలుసుకోలేకపోతే నాకు అదృష్టం లేనట్టే. అందుకే ఈసారి వచ్చినపుడు మాత్రం తప్పకుండా కలవండి’ అంటూ ఆ అభిమానిని రిక్వెస్ట్ చేసింది అనసూయ.