English | Telugu

చిరంజీవి,పవన్ కళ్యాణ్ స్పెషల్ స్క్రీనింగ్ వైరల్..సైలెంట్ గా కానిచ్చేశారు 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ఎవరి ఊహలకి అందని విధంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ జి 250 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ ని రాబట్టిందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

రీసెంట్ గా ఓజి స్పెషల్ స్క్రీనింగ్ హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ల్యాబ్(Prasad labs)లో ప్రదర్శించడం జరిగింది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan),పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వీక్షించడం జరిగింది. దర్శకుడు సుజీత్(Sujeeth)థమన్,నిర్మాత దానయ్య ,సినిమాటోగ్రాఫర్ రవికేచంద్రన్ సహా ఇతర ముఖ్యులు కూడా ఈ షో లో పాల్గొన్నారు. మూవీ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రత్యక్షమవడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

'ఓజి' ఇప్పటికే 250 కోట్లని రాబట్టడంతో క్లోజింగ్ కలెక్షన్స్ ఏ మేర వస్తాయనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఉంది. విజయదశమి ఫెస్టివల్ ఉండటం కూడా కలిసి వచ్చే అవకాశం. ఇటీవల ఓజి ని పైరసీ చేస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,నానితో పాటు పలువురు సినీనటులు హైదరాబాద్ పోలీసులతో భేటీ అయ్యి ధన్యవాదాలు తెలిపారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.