English | Telugu

రామోజీరావు పై చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. ఆ రోజు ఇంటికి కేక్ పంపించి కోయించారు 

ప్రముఖ సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ అధినేత,'రామోజీరావు'(Ramoji Rao)గారు, బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి 'ఈటీవీ' (Etv)అనే ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసిందే. 1995 అగస్ట్ 27 న ప్రారంభమైన 'ఈటీవీ' ప్రస్తుతం పలు ఛానల్స్ ని అనుసంధానంగా చేసుకొని భారతదేశంలోని పలు భాషల్లో విస్తరించి ఉంది. సదరు చానల్స్ లో వచ్చే కార్యక్రమాలన్నీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తు వస్తున్నాయి. రీసెంట్ గా ఈటీవీ 30 వ వార్షికోత్సవ వేడుకలు ఫిలింసిటీలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు 'ఈటీవీ' 30 వ వార్షికోత్సవ సభకి రావడం నా భాద్యత. 1995 లో జరిగిన ఈటీవీ ప్రారంభ వేడుక నా కళ్ళ ముందు ఉంది. మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా రావడంతో పాటు 20 వ వార్షికోత్సవానికి కూడా వచ్చాను. కొవిడ్ కారణంగా 25 వ వార్షికోత్సవం చేయలేకపోయారు. కానీ నా మీద ప్రేమతో మా ఇంటికి కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. ఆ సమయంలో నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మళ్ళీ ఈ వేడుకలో భాగం కావడం నా అదృష్టం.

రామోజీరావు గారు నాకెప్పుడు స్ఫూర్తే. ఎప్పుడు కలిసినా, ఆయన చెప్పే మాటల ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే వాడ్ని. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన రామోజీరావు గారు, మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, చరిత్ర సృష్టించాలని భావించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ తో అనుకున్నట్టుగానే ఆయన తన పేరుని చరిత్రలో శాశ్వతంగా ఉండేలా చేసుకున్నారని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(K.Raghavendrarao)నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)కీరవాణి(Keeravani)ఖుష్భు(Kushboo),మురళి మోహన్(Murali Mohan)తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.