English | Telugu

ఛార్మిని నిలువునా ముంచేశారు



జ్యోతిల‌క్ష్మితో ఛార్మి కెరీర్ జెట్ వేగంతో దూసుకుపోతుంద‌నుకొన్నారంతా! ఆ సినిమాతో ఛార్మి వెలుగులు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయ‌ని భావించారంతా! న‌టిగానే కాదు, నిర్మాత‌గానూ ఆ సినిమా ఛార్మికి చాలా కీల‌క‌మైంది. ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా చేజిక్కించుకొని ఆ రూపేణా రూ.5 కోట్ల వ‌ర‌కూ త‌న ఖాతాలో వేసుకొందామ‌నుకొంది. అయితే ఈ లెక్క‌ల‌న్నీ నీటిమీద రాత‌ల‌య్యాయి. సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఇప్పుడు సి.క‌ల్యాణ్ చేతులెత్తేసిన‌ట్టు టాక్‌. ఛార్మికి వాటా కాదుక‌దా... పారితోషికం రూపేణా ఒక్క రూపాయి కూడా ముట్ట‌లేద‌ట‌.

వాటా అంటూ ఆశ‌ల‌కు పోకుండా పారితోషికం అందుకొన్నా...క‌నీసం రూ.50 ల‌క్ష‌లైనా వ‌చ్చేవి. రూ.5 కోట్ల‌పై ఆశ‌ల‌తో ఈ రూ.50 ల‌క్ష‌ల్ని ప‌ణంగా పెట్టింది. ఇప్పుడు ఆ రెండూపోయాయ‌ని ఉసూరుమంటోంది ఛార్మి. మ‌రోవైపు జ్యోతిల‌క్ష్మి త‌ర‌వాత పూరితో డీలింగ్స్ కూడా పోయాయ‌ని టాక్‌. ఇది వ‌ర‌కు ఎక్కువగా పూరి ఆఫీసులోనే గ‌డిపే.. ఛార్మి ఇప్పుడు త‌ట్టా బుట్టా స‌ర్దేసుకొని అక్క‌డి నుంచి జంప్ అయిపోయింద‌ట‌. పూరి కూడా ఛార్మితో ట‌చ్‌లో లేకుండా పోయాడ‌ని టాక్‌. మొత్తానికి జ్యోతిల‌క్ష్మి ఛార్మి కెరీర్‌కి హైప్ తెస్తుంద‌ని భావిస్తే... ఆ సినిమాతో నిలువుగా మునిగిపోయింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.