English | Telugu

ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు..  చూసి నచ్చితే పది మందికి చెప్పండి!

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. డాలీషా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. "నేను ఈ కథను చాలా ఏళ్ల క్రితం విన్నాను. సాఫ్ట్ వేర్ సుధీర్ కంటే ముందే ఈ కథను విన్నాను. గాలోడు, ఈ చిత్రం రెండూ ఒకేసారి ప్రారంభించాం. గాలోడు హిట్ అయింది. మాస్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రాబోతున్నాను. ఈ జానర్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకోవాలని అనుకుంటున్నాను. వీలున్నప్పుడు, టైం దొరికినప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తాను. మార్క్ కే రాబిన్, గ్యారీ గారు రావడంలో మా సినిమా స్థాయి పెరిగింది. డిసెంబర్ 1న మా చిత్రం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సినిమా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండి" అని అన్నారు.

దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ.. "ఈ కథ రాసుకున్నప్పుడు నేను ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. నా కథ సుధీర్ వల్ల చాలా మందికి వెళ్తుందని అనుకుని తీసుకున్నాను. సుధీర్ గారు ఏ సినిమాను అంగీకరించక ముందే ఈ కథను ఓకే చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్‌ మీద సినిమా రాలేదు. నా టీం సహకరించడం వల్లే సినిమా బాగా వచ్చింది. మార్క్ కే రాబిన్ ఆర్ఆర్, సన్నీ కెమెరాపనితనం, మోహిత్ పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి." అన్నారు.

నిర్మాత విజేష్ త‌యాల్‌ మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు అద్భుతంగా తీశారు. సుధీర్ గారి గురించి చెప్పేందుకు మాటలు చాలవు. మీడియానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి" అని కోరారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. "టీం అంతా కలిసి ఇష్టంగా ఈ సినిమాను తీసినట్టుగా నాకు అనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు నిర్మించారు. మంచి స్క్రిప్ట్‌తో రాబోతున్నారు. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నా వంతుగా సాయం చేస్తున్నా. థ్రిల్లింగ్ అంశాలతో రాబోయే ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ అందరికీ తెలుసు. అందరినీ ఈ చిత్రం సంతృప్తి పరుస్తుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. డిసెంబర్ 1న రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి" అని అన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ.. "నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నేను ఇక్కడ ఉండటానికి కారణం వాళ్లే. నన్ను నమ్మి పాత్రను నాకు ఇచ్చిన అరుణ్ విక్కిరాలా సర్‌కు థాంక్స్. సుధీర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి మోహిత్ రెహమానియక్ పాటలు స్వరపరచగా, మార్క్ కె రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రాఫర్ గా సన్ని.డి, ఎడిటర్ గా గ్యారీ బి.హెచ్‌ వ్యవహరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.