English | Telugu

రెండువేల థియేటర్లలో "బిజినెస్ మ్యాన్"

రెండువేల థియేటర్లలో "బిజినెస్ మ్యాన్" సినిమా విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం దాదాపు రెండు వేల థియేటర్లలో విడుదల కానుంది.

ఒక్క హైదరాబాద్ లోనే వంద థియేటర్లలో ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలవుతూంటే, మొత్తం నైజాంలోమూడు వందల థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే యు.యస్.లో 120 థియేటర్లలో ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం విడుదలవుతూంది. ఇక్కడ ఇన్నిథియేటర్లలో ఒక తెలుగు చిత్రేం విడుదలవటం ఒక రికార్డు. గతంలో యన్ టి ఆర్, పవన్ కళ్యాణ్ చిత్రాలు వంద థియేటర్లలో విడుదలయ్యాయి.

దీన్ని బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండువేల థియేటర్లలో విడుదలవటం ఆశ్చర్యం కలిగించే విషయమేం కాదు. అలాగే ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం తొలి రోజు కలెక్షన్ల రికార్డు కూడా సృష్టిస్తుందనటంలో అనుమానం లేదు. ఆ తర్వాత సినిమా బాగుంటే రికార్డుల మీద రికార్డులు...లేకుంటే అక్కడితో రికార్డుల గోల ఆగుతుంది. ఏ విషయం తెలియటానికి జనవరి 13 వ తేదీ వరకూ ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.