English | Telugu

"హీరోయిన్లను మోసం చేసే మహేష్ బాబు" -పూరీ

"హీరోయిన్లను మోసం చేసే మహేష్ బాబు" అని "బిజినెస్ మ్యాన్" చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మనసున్న మంచి నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నన చిత్రం "బిజినెస్ మ్యాన్".

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో విడుదల సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక తమాషా చేశారు. మహేష్ బాబుని ఇలియానా, కాజల్ అగర్వాల్, అనుష్క ఇలా ఒక్కో హీరోయిన్ గురించి అడిగి, దానికాయన చెప్పిన సమాధానాలను షూట్ చేసి, ఆ క్లిప్పుంగులను "బిజినెస్ మ్యాన్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో వేశారు.

ఆ క్లిప్పుంగుల్లో మహేష్ బాబు ఆ హీరోయిన్లందరి గురించీ వాళ్ళు చాలా మంచి నటీమణులనీ వాళ్ళకి వృత్తి మీద అంకితభావం ఉందనీ, ఇలా గొప్పగా చెప్పారు.అవన్నీ నిజం కావనే భావనతో ఆ క్లిప్పుంగుల మీద మాట్లాడుతూ "చూశారా మీ హీరో హీరోయిన్లను ఎలా మోసం చేస్తున్నాడో" అని అన్నారు. ఈ క్లిప్పుంగులకు ఆహూతుల నుండి చక్కని స్పందన లభించింది. ఇంకా హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత కూడా ఈ క్లిప్పుంగులు చూసి పగలబడి నవ్వారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.