English | Telugu

"బిజినెస్ మ్యాన్" "దూకుడు" ని కొట్టాలి- శ్రీను వైట్ల

"బిజినెస్ మ్యాన్" "దూకుడు" ని కొట్టాలి అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మనసున్న మంచి నిర్మాత డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నన చిత్రం "బిజినెస్ మ్యాన్".

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో విడుదల సందర్భంలో "దూకుడు" చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల ప్రసంగిస్తూ "మీరు నాకు "దూకుడు" రూపంలో బ్లాక్ బస్టర్ చిత్రమిచ్చారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులందరికి థ్యాంక్స్."దూకుడు"ని "బిజినెస్ మ్యాన్" కొట్టాలని కోరుతున్నా. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ చిత్రం ప్రోమోస్ చూశాను. చాలా బాగున్నాయి. పూరీ జగన్నాథ్ గారి పెన్ పవరేంటో మనందరికీ తెలుసు. డైలాగులు చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడాలని మీలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.