English | Telugu

విజయ్‌ ఇంట్లో బాంబు.. మొదలైన పోలీసుల వేట!

దళపతి విజయ్‌కి తమిళనాట ఎంత ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. రజినీకాంత్‌ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్‌. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించారు విజయ్‌. ‘తమిళగ వెట్రి కళగం’(టివికె) పేరుతో ఓ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి వెళ్లి వారిని కలుసుకునేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు విజయ్‌. సెప్టెంబర్‌ 27న కరూర్‌లో జరిగిన ఈ ర్యాలీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. కరూర్‌ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూర్‌ పశ్చిమ జిల్లా మథియాళన్‌, కార్యకర్త పౌన్‌రాజ్‌, యూట్యూబర్‌ ఫెలిక్స్‌ జెరాల్డ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరూర్‌ ఘటనపై పలువురు తమ నిరసనను వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నేతలు కూడా జరిగిన ఘటనపై వ్యాఖ్యానాలు చేశారు. ఇదిలా ఉంటే.. విజయ్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్‌ 100కి కాల్‌ చేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ‘మరోసారి విజయ్‌ పబ్లిక్‌ మీటింగ్‌ పెడితే.. వాళ్ళ ఇంట్లో బాంబు పెడతాను’ అని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెన్నయ్‌లోని విజయ్‌ ఇంటి దగ్గర భద్రత మరింత పెంచారు. కాల్‌ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి అతని లొకేషన్‌ను ట్రేస్‌ చేస్తున్నారు. 100కి వచ్చిన ఈ కాల్‌ గురించి తెలుసుకొని విజయ్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.