English | Telugu

వార్ 2 కి యానిమల్ కి లింక్!.. ఎన్టీఆర్ చెప్పిన సర్పైజ్ అదేనా! 

ఈ నెల 14 న ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'వార్ 2'(War 2)థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఐదు దశాబ్దాలపై నుంచి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మిస్తు వస్తున్న 'యష్ రాజ్ ఫిల్మ్స్'(Yash Raj Films)వార్ 2 ని రూపొందించింది. కథని భారీగా సమకూర్చడంలోను, అందుకు తగ్గ ఆర్టిస్టులని ఎంచుకోవడంలో యష్ రాజ్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. వార్ 2 కథకి ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా సూటవుతాడని భావించిన యష్ రాజ్ సంస్థ, ఎన్టీఆర్ కోసం చాలా కాలం పాటు వెయిట్ చేసి మరి వార్ 2 ని నిర్మించింది. దీన్ని బట్టి నటీనటుల విషయంలో యష్ రాజ్ కమిట్ మెంట్ ని అర్ధం చేసుకోవచ్చు.

ఇక వార్ 2 లో స్టార్ యాక్టర్ 'బాబీడియోల్'(Bobby Deol)కూడా ఒక కీలక క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని, క్లైమాక్స్ కి ముందు సదరు క్యారక్టర్ ఎంటరై ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వార్ 2 పక్కా యాక్షన్ చిత్రం. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాట సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. బాబీ డియోల్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో చేస్తాడు. యానిమల్(Animal),డాకు మహారాజ్(Daku Maharaj)హరిహర వీరమల్లు(Harihara Veeramallu)వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.

ఈ నేపథ్యంలో వార్ 2 లో బాబీడియోల్ ఉండటం నిజమైతే మూవీకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తో పాటు మేకర్స్ పలు ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మూవీలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని బట్టి బాబీ డియోల్ ఉండే అవకాశం ఉందనే మాటలు కూడా వినపడుతున్నాయి.కియారా అద్వానీ(Kiara Advani)అనిల్ కపూర్, అశుతోష్ రానా కీలక పాత్రలు పోషిస్తున్న వార్ 2 కి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకుడు. 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్(War)కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.