English | Telugu

బిందు కోరిక నెరవేరుతుందా?

తాప్సీ తనకు ఆదర్శం అంటోందట ఆవకాయ్ బిర్యాని భామ బిందుమాధవి. తాప్సీ అంతగొప్ప పనేం చేసిందో? ఆమెను ఆదర్శంగా తీసుకోవడానికి అని కోలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారట. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటినుంచి ఐరెన్ లెగ్గుగా మైనస్ మార్కులేయించుకున్న తాప్సీ... గంగంతో ఓ రేంజ్ కెళ్లిపోయింది.

ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందని....లేటెస్ట్ మూవీ జాక్సన్ దురైతో తన కెరీర్ ఓ రేంజ్ కెళ్లిపోతుందని తెలుగమ్మాయి నమ్మకంగా ఉందట. ఆవకాయ్ బిర్యానీలో బిందుని చూసి బాగుందనిపించినా....అమ్మడికి ఆఫర్లు దక్కలేదు. దీంతో కోలీవుడ్ కి చెక్కేసింది. అడపా దడపా ఛాన్సులు సొంతంచేసుకుంటోందే కానీ ఇప్పటి వరకూ బ్రేక్ రాలేదు. శిబిరాజ్ తో కలసి నటిస్తోన్న జాక్సన్ దురై తన ఫేట్ మారుస్తుందని నమ్మకంగా ఉంది. మరి ఆవకాయ్ పిల్ల కోరిక నెరవేరుతుందంటారా?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.