English | Telugu

'భీష్మ' కాంబోలో మైత్రి మూవీ!

నితిన్, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భీష్మ'. 2020 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

నాగ శౌర్య, రష్మిక జంటగా రూపొందిన 'ఛలో'(2018)తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత 'భీష్మ'తో వరుసగా రెండో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాంతో ఏకంగా మూడో సినిమాకే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఏవో కారణాల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో 'భీష్మ' కాంబోలోనే తన మూడో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు వెంకీ. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మార్చి 24 లేదా 30న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

నితిన్ కి ఇది మైత్రి బ్యానర్ లో మొదటి సినిమా కాగా, రష్మిక ఇప్పటికే మైత్రి బ్యానర్ లో 'డియర్ కామ్రేడ్', 'పుష్ప' వంటి సినిమాలు చేసింది. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న వరుసగా మూడో సినిమాలోనూ రష్మిక హీరోయిన్ కావడం విశేషం. మొదటి రెండు సినిమాలు 'ఛలో', 'భీష్మ' తరహాలోనే ఈ మూవీ కూడా ఘన విజయం సాధిస్తుందేమో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.