English | Telugu

ఓటీటీలోకి 'భగవంత్ కేసరి'.. ఎప్పుడు? ఎక్కడ?

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి' నేడు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ తో పాటు ఇప్పటికే చాలా చోట్ల మొదటి షోలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' విజయాలతో జోరు మీదున్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడని నందమూరి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించిన అప్డేట్ వైరల్ గా మారింది.

'భగవంత్ కేసరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సినిమా టైటిల్ కార్డ్స్ లో ఈ విషయాన్ని రివీల్ చేశారు. అయితే ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందట. ఈమధ్య జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. కానీ 'భగవంత్ కేసరి' మాత్రం థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి రానుందట. డిసెంబర్ రెండో వారం తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానుందని సమాచారం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.