English | Telugu

ఓటీటీలో 'భగవంత్ కేసరి' సందడి షురూ!

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి, భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.

'భగవంత్ కేసరి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 24) నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. అంటే ఈ అర్ధరాత్రి 12 నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో సంచలన వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. థియేటర్లలో మిస్ అయిన కుటుంబ ప్రేక్షకులు ఓటీటీలో బ్రహ్మరథం పట్టే అవకాశముంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.