Read more!

English | Telugu

బాలయ్యను కూడా ఫుల్లుగా వాడేసుకుంటున్నారు..!

టాలీవుడ్ లో పెద్ద హీరోలను వాడుకుని చిన్న సినిమాలు బాగా ఆడించేసుకోవాలనుకునే పద్ధతి పాతదే. ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్ పేరును, ఏమంటివి ఏమంటివి డైలాగునూ సినిమాల్లో ఫుల్లుగా ఉపయోగించుకునేవారు. ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పీక్స్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం జరిగింది. చిరు రాజకీయప్రవేశంతో, ఆ వారసత్వం పవన్ కళ్యాణ్ కు దక్కింది. లేటెస్ట్ గా బాలయ్య బాబును కూడా ఫుల్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మన సినీ జనాలు. ఇప్పటి వరకూ మెగా హీరోను మాత్రమే వాడుకోవడంలో ముందున్న సినీపరిశ్రమ పటాస్, కృష్ణగాడి వీర ప్రేమగాథతో బాలయ్య ను వాడుకోవడం మొదలెట్టింది. సింహా, లెజండ్ సినిమాల్లో బాలయ్య డైలాగులు చాలా బాగా పేలాయి. అందుకే ఆ సినిమాలను చూపించి, బాలయ్య మాస్ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటున్నారు.

పటాస్ లో బాలయ్య అరే ఓ సాంబా పాటను రీమేక్ చేయడంతో పాటు, ఆయన స్టిల్స్ వాడుకున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథలో నాని కూడా జై బాలయ్య అంటూ లెజండ్ డైలాగ్స్ ను రింగ్ టోన్స్ గా వాడేశాడు. రన్ సినిమాలో కూడా సేమ్ డైలాగ్ ను రిపీట్ చేశారు. దీంతో నందమూరి హీరోలు మనమేం తక్కువ అనుకున్నారో ఏమో గానీ, మొన్న జరిగిన రాజా చెయ్యి వేస్తే ఆడియోలో మాట్లాడిన ప్రతీ ఒక్కళ్లూ జై బాలయ్య అని నినాదం ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు. త్వరలో రాబోతున్న నారా రోహిత్ సావిత్రి సినిమాలో కూడా, 20 నిముషాల పాటు బాలయ్య స్పెషల్ గా ఎపిసోడ్ ఉంటుందని ఫిలింనగర్ టాక్. ఎవర్ని ఎంత వాడినా, పబ్లిసిటీ వరకూ మాత్రమే. ప్రేక్షకుడు హాల్ కు వచ్చిన తర్వాత బాలయ్య బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ చూడడు. సినిమాలో విషయం ఉందా లేదా అనేదే అతనికి ముఖ్యం.