Read more!

English | Telugu

మెగాస్టార్ కు, క్రికెటర్ కు మధ్య గొడవ..!

టి20 వరల్డ్ కప్ లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియన్స్ అందరికీ చిరస్మరణీయ మ్యాచ్ అన్న విషయం ఎవరూ కాదనలేనిది. విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్ తో ఒంటిచేత్తో టీం ఇండియాను సెమీస్ కు చేర్చేశాడు. అయితే ఈ విషయమై ఇప్పుడు మెగాస్టార్ కు, ఒక క్రికెటర్ కు మధ్య గొడవ జరుగుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్, విరాట్ కోహ్లీ ఇలాగే ఆడితే, కొన్నాళ్లకు తమ క్రికెటర్ రూట్ స్థాయికి చేరుకుంటాడని వెళాకోళంగా ట్వీట్ చేశాడు. దానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రూట్ ఎవరు..? రూట్స్ తో సహా పీకేస్తాం అని రిప్లై ఇచ్చారు. ఫ్లింటాఫ్ మళ్లీ వెనక్కి అమితాబ్ బచ్చన్ ఎవరు అని రిప్లై ఇచ్చాడు.

నిజానికి ఫ్లింటాప్ కు అమితాబ్ ఎవరో, ఇండియాలో ఆయన ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుసు. కానీ సరదాకి అలా ట్వీట్ చేశాడు. అదే అతను చేసిన తప్పయిపోయింది. అందులో వేళాకోళం అర్ధం కానీ అమితాబ్ బచ్చన్ అభిమానులు, ఫ్లింటాఫ్ ను ట్విట్టర్లో ఆడేసుకున్నారు. అతన్ని తిడుతూ, వెక్కిరిస్తూ ఇంకా రకరకాలుగా ఫ్లింటాఫ్ కు చుక్కలు చూపించారు. దాంతో ఫ్లింటాఫ్ తిరిగి ట్వీట్ చేయాల్సి వచ్చింది. తిట్లు గట్టిగానే వస్తున్నాయి. కొంతమందికి వేళాకోళం పరిగ్గా అర్ధమవ్వదు అనుకుంటా అంటూ ట్వీట్ చేశాడు ఫ్లింటాఫ్. అమితాబ్ కున్న 20 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లు, ఫ్లింటాఫ్ ను ఆడేసుకోవడంతో సైలెంట్ గా ఈ టాపిక్ నుంచి తప్పుకున్నాడు. 2007 వరల్డ్ కప్ లో, ఫ్లింటాఫ్ తో గొడవ తర్వాతే, యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టిన సంగతి తెలిసిందే.