Read more!

English | Telugu

బాలయ్య వందో సినిమా అనౌన్స్ మెంట్

తన 99 సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నా, ఫ్లాపులున్నా నెక్స్ట్ సినిమా చకచకా చేసుకవెళ్లిపోవడం తప్ప, ఎప్పుడూ ఇంతలా బాలయ్య ఆలోచించలేదు. దీనిబట్టే అర్దమవుతోంది ఆయన వందో సినిమాను ఎంత ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారో. అందుకే కాస్త టైం పట్టినా, బాలయ్య తన వందో సినిమాపై పూర్తి క్లియర్ గా డెసిషన్ తీసేసుకున్నారు. తన సెంచరీ సినిమాపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కానీ డెసిషన్ ను మాత్రం, తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజున అనౌన్స్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు బాలయ్య.

డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ, డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా, శాతవాహన వంశపు ఆఖరి రారాజు గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుంది. ఏప్రిల్ 8 న ఎనౌన్స్ మెంట్, 22 నుంచి రెగులర్ షూటింగ్ షురూ అనేది ప్రస్తుతం క్రిష్ ఆలోచన. సినిమాను వీలైనంత గ్రాండ్యుయర్ గా తెరకెక్కించాలని క్రిష్ అనుకుంటున్నాడట. కెరీర్లో ఫస్ట్ టైం సీనియర్ హీరోతో భారీ సినిమాను హ్యాండిల్ చేస్తున్న క్రిష్, అందుకు తగ్గట్టుగానే సమాయత్తమవుతున్నాడు. మూవీకి యోధుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నా, అభిమానులకు ఈ టైటిల్ పెద్దగా రుచించకపోవడంతో, మరో టైటిల్ ఆలోచించే అవకాశం ఉంది. ఈ ఉగాదికి తన అనౌన్స్ మెంట్ తో బాలయ్య అభిమానుల నోరు తీపి చేయబోతున్నారన్నమాట.