Read more!

English | Telugu

బాల‌య్య ని రౌండ‌ప్ చేస్తున్నారు

 

బాల‌కృష్ణ వందో సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇది వ‌ర‌కు వందో సినిమా అన‌గానే.. బోయ‌పాటి శ్రీ‌ను పేరే ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చేది. ఇప్పుడు అలా కాదు.. ఓ అర‌డ‌జ‌ను ద‌ర్శ‌కులు బాల‌య్య‌ని రౌండ‌ప్ చేస్తున్నారు. `మా క‌థ వినండి` అంటే `మా క‌థ వినండి` అంటూ క్యూ క‌ట్టేస్తున్నారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు ఇప్ప‌టికే ఆదిత్య 999 క‌థ‌తో వెయింట్ లిస్టులో తొలి స్థానాన్ని ఆక్ర‌మించేశారు. ఆ త‌ర‌వాత క్రిష్ లైన్లోకి వ‌చ్చాడు. ఓ ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో బాల‌య్య‌ని క‌లిసిన‌ట్టు స‌మాచారం. క్రిష్‌తో ప‌నిచేయ‌డానికి బాల‌య్య కూడా ఉత్సాహంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

 

గుణ‌శేఖ‌ర్ ప్ర‌తాప రుద్రుడు క‌థ‌ని బాల‌య్య కోస‌మే సిద్ధం చేశాడ‌ని టాక్‌. ఆయ‌నా.. బాల‌య్య పిలుపు కోసం వెయిటింగ్‌. ఇప్పుడు కృష్ణ‌వంశీ కూడా లైన్లో నిల‌బ‌డ్డాడ‌ట‌. ఓ సోషియో పాంట‌సీ క‌థ‌తో బాల‌య్య‌ని క‌ల‌వ‌డానికి అపాయింట్‌మెంట్ కూడా తీసుకొన్నాడ‌ని చిత్ర‌సీమ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. అనిల్ రావిపూడి `రామారావుగారు` అనే ఓ వెరైటీ క‌థ రాసుకొన్నాడు. ఇదో పొలిటిక‌ల్ సెటైర్‌. ఈ లైన్ కూడా బాల‌య్యకు బాగా న‌చ్చింద‌ట‌. ఇప్పుడు బాల‌య్య ముందు బోల్డ‌న్ని ఆప్ష‌న్లు. అందులో స‌రైన‌ది ఎంచుకోవ‌డ‌మే మిగిలింది. మ‌రి.. ఈ క‌న్‌ఫ్యూజ‌న్‌లో బాల‌కృష్ణ ఏం చేస్తాడో, ఎంత‌లా స‌ర్‌ప్రైజ్‌కి గురి చేస్తాడో చూడాలి.