English | Telugu

యన్.టి.ఆర్. ఘాట్ ని దర్శించుకున్న జూనియర్

యన్.టి.ఆర్. ఘాట్ ని దర్శించుకున్న జూనియర్, హరికృష్ణ . వివర్ల్లోకి వెళితే విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా, పలువురు ఆయన అభిమానులు ఆయన సమాధి యన్.టి.ఆర్. ఘాట్ ని సందర్శించుకుని ఆయనకు ఘననివాళులర్పించారు.

ముమ్మూర్తులా ఆయన పోలికలనే కాకుండా, ఆయన నటనాప్రతిభను కూడా పుణికిపుచ్చుకున్న జూనియర్ యన్.టి.ఆర్., ఆయన తండ్రి నందమూరి హరికృష్ణనిన్న జనవరి 18 వ తేదీన, యన్.టి.ఆర్. ఘాట్ ని సందర్శించుకుని, కొద్దిసేపుమౌనం పాటించి, ఆయన సమాధివద్ద పుష్పగుచ్ఛాలనుంచి, ఆయనకు ఘననివాళులర్పించారు. జూనియర్ యన్ టి ఆర్ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో "దమ్ముః అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.