English | Telugu

మిస్ ఇండియాతో సింహ సరసాలా?



నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం హీరోయిన్ గా మిస్ ఇండియా ౨౦౧౨ ఎరికా ఫెర్నాండెజ్ నటించబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హిందీలో తాను నటించిన "లవ్ ఇస్ నాట్ మాతేమటిక్స్" చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అదే విధంగా తెలుగులో "డేగ" అనే చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి, బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చేసరికి తీన్మార్ డాన్స్ ఆడుతుందని ఫిల్మ్ నగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఇదే నిజమైతే బాలయ్య ఖాతాలో మరొక హీరోయిన్ ప్లాప్ బట పట్టాల్సిందే. ఎందుకంటే... గతంలో ఇపుడున్న అగ్ర కథా నాయికలు తప్ప.. బాలయ్యతో నటించిన అందరు హీరోయిన్స్ అవకశాలు రాక స్టేజ్ షో లకు పరిమితం అవుతున్నారు. మరి ఈ మిస్ ఇండియా సుందరి పరిస్థితి ఏమవుతుందో త్వరలోనే తెలియనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.