English | Telugu

త్రిషకు సెలైన్ ఎక్కిస్తున్నారు !

గాభరా పడకండి. సెలైన్ ఎక్కిస్తున్నది త్రిష కెరీర్‌కి. త్రిష కెరీర్ ఇక క్లైమాక్స్‌కి చేరిపోయిందంటూ అందరూ కన్‌క్లూజన్‌కు వచ్చేస్తూ.. త్రిషను కన్‌ఫ్యూజ్ చేస్తున్న తరుణంలో ఓ బంపర్ ఆఫర్ త్రిషను వరించింది. రెండుమూడేళ్లకు ఓ సినిమా చేస్తున్న రజనీకాంత్‌ను పక్కనపెడితే.. తమిళంలో సూర్య ఇప్పుడు నెం.1. తెలుగులోనూ దాదాపు పాతిక కోట్లు మార్కెట్ (శాటిలైట్ రేట్స్‌తో కలిపి) కలిగిన సూర్య ఇరవై కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. మిగతా హీరోలందరికంటే చాలా పైనున్నాడు. అటువంటి సూర్య సరసన నటించే సూపర్ ఛాన్స్‌ను కొట్టేసింది త్రిష. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో హీరోయిన్‌ఘా త్రిష ఎంపికైంది. తమిళంలో ఈ చిత్రానికి "ధృవ నచ్చిత్రం" (ధృవ నక్షత్రం) అనే పేరు పెట్టారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ ఆఫర్‌తో త్రిష కెరీర్‌కు మరో అయిదారేళ్లు "ఎక్స్‌టెన్షన్" లభించినట్లే. నిన్నటివరకు త్రిషను చిన్నచూపు చూసినవాళ్లంతా.. మళ్లీ ఇప్పుడు "పెద్ద చూపు" చూసే పరిస్థితి ఏర్పడింది!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.