English | Telugu

బాలయ్య డైలాగ్ బాగాలేదా!

"కొందరు ఆశించడానికి పుడతారు, కొందరు శాసించడానికి పుడతారు" అంటూ తన తాజా చిత్రం కోసం నందమూరి బాలకృష్ణ ఓ డైలాగ్ చెప్పారు. అందులో అర్ధమేమైనా ఉందా?. "ఆశించడం.. శాసించడం" అనే మాటల్లోని రైమ్ బాగుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను భావించి ఉంటాడు. అది బాలయ్యకు విపరీతంగా నచ్చేసి ఉంటుంది. అంతే.. ఆ డైలాగ్‌తో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించేసారు. బాలకృష్ణకు "సింహా" వంటి సూపర్‌హిట్ ఇచ్చిన బోయపాటి.. ఆ తర్వాత దర్శకుడిగా తన "దమ్ము" చూపించలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ బాలకృష్ణతో మరోసారి పని చేస్తున్నాడు. "14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్_వారాహి చలన చిత్ర" అనే రెండు నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యం చేస్తున్నాడు. బాలకృష్ణ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందుస్తుందడం ఇదే తొలిసారి. హీరోయిన్ల ఎంపిక జరుపుకొంటున్న ఈ చిత్రం బాలకృష్ణకు సినిమాపరంగానే కాకుండా రాజకీయపరంగానూ చాలా కీలకం!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.