Read more!

English | Telugu

ఆ సినిమా నా నిజ జీవిత కథే..బేబీ డైరెక్టర్ వెల్లడి  

బేబీ సినిమా ఘన విజయంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన  దర్శకుడు సాయి రాజేష్. 2014 లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు  హీరోగా వచ్చిన హృదయకాలేయం ఆయన మొదటి మూవీ.. స్టీఫెన్ రాజేష్ పేరుతో ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు.మళ్ళీ సంపూర్ణేష్ తోనే  కొబ్టరి మట్ట కూడా తీసాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో  ఒక సీక్రెట్ ని బయటపెట్టాడు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2020 లో ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో కలర్ ఫోటో మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. సుహాస్, చాందిని చౌదరి,సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అశేష ప్రేక్షకాదరణని పొందటంతో పాటు  నేషనల్ అవార్డు ని సైతం సాధించింది.  కలర్ ఫోటో కథ సాయి రాజేష్ దే. ఇప్పుడు ఈ కథ విషయంలోని  సీక్రెట్  నే రాజేష్ బయటపెట్టాడు. కలర్ ఫోటో కథ నిజ జీవితంలో తనకి తన భార్యకి మధ్య జరిగిందని చెప్పాడు. అంటే సాయి రాజేష్ వైఫ్ కలర్ సాయి రాజేష్ బ్లాక్ 

 

 ఈ సందర్భంగా పెద్ద హీరో సినిమాల ప్రస్తావన కూడా వచ్చింది..నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలనే  మైండ్ సెట్ లేదు. ముందు వాళ్లు ఛాన్స్ ఇవ్వాలి. పైగా  నాకు రియాలిటీ ఏంటో తెలుసు. వాళ్లు సెట్‌లోకి వస్తే.. వాతావరణం మొత్తం మారిపోతుంది. సినిమా మన చేతుల్లో ఉండదనే భయం కూడా  ఉందని చెప్పాడు.ప్రస్తుతానికి రెండు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. సాయి రాజేష్  మెగాస్టార్ కి వీరాభిమాని అనే విషయం  అందరకి తెలిసిందే