English | Telugu

గుండెపోటుతో ప్రముఖ సింగర్ మృతి 

భారతీయ చిత్ర పరిశ్రమలో సింగర్ 'బబ్లామెహతా'(Babla Mehta)కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆలపించిన బబ్లా 'గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్' గా కూడా కీర్తిని గడించాడు. లెజండ్రీ గాయనిమణి 'లతా మంగేష్కర్'(Lata Mangeshkar)తో కలిసి కూడా పాడటం జరిగింది.

ఈ నెల 22 వ తారీఖున బబ్లా మెహతా ముంబైలో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకి రాగా, బబ్లా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియచేసారు. కొన్ని చిత్రాలకి సంగీతాన్ని కూడా అందించడంతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా తన స్వరకల్పనలో వచ్చాయి.

దిల్ హై కే మంత నహిన్, చాందిని, సడక్, తహల్కా, మేజర్ సాబ్ చిత్రంలోని పాటలు మెహతాకి మంచి గుర్తింపుని ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు కాగా 'ఢిల్లీ' స్వస్థలం.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.