English | Telugu

ఆంధ్రా, తెలంగాణాలో 'బాహుబలి' కలెక్షన్ల సునామి

రాజమౌళి బాహుబాలి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూ, బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళుతుంది. మొదటి వారం తరువాత ఈ సినిమా కలెక్షన్లు నెమ్మదిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసాయి. అయితే బాహుబలి అందరి అంచనాలను తిప్పికొట్టి రెండో వారంలో కూడా అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది. ఆంధ్ర, తెలంగాణలో మాత్రం ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతోంది. రెండో వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా కేవలం ఆంధ్రా, తెలంగాణాలో 87.1 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ కలెక్షన్ల చరిత్రను తిరగరాసింది. 'బాహుబలి' ఆంధ్రా, తెలంగాణా కలెక్షన్ల వివరాలు మీ కోసం:

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో 'బాహుబలి' ఏరియాల వారీ కలెక్షన్స్( షేర్ )

నైజాం Rs 32.09 crore

సీడెడ్ Rs 17.7 crore

వైజాగ్ Rs 7.49 crore

గుంటూరు Rs 7.80 crore

కృష్ణా Rs 5.44 crore

ఈస్ట్ గోదావరి Rs 7.23 crore

వెస్ట్ గోదావరి Rs 6.05 crore

నెల్లూరు Rs 3.30 crore

టోటల్ Rs 87.1 Crore (ఆంధ్రా, తెలంగాణ షేర్ )

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.