English | Telugu

తెలుగు సినిమా సత్తా చూపించిన 'బాహుబలి'

బాహుబ‌లి రికార్డుల ఫ‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్నిటినీ ఈ సినిమా కొట్టేసింది. ఫుల్ ర‌న్‌లో పీకే రికార్డుల్ని కొట్టే ఛాన్స్ ఉందా లేదా? అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే .. ఈ సినిమా తొలివారం రికార్డుల్లో అద్భుతాలు ఆవిష్క‌రించింది. బాహుబ‌లి రిలీజై స‌రిగ్గా ఈరోజుకి వారం పూర్త‌య్యింది. రేప‌టి నుంచి రెండో వారంలో అడుగు పెడుతోంది.

ఇప్ప‌టికి ఈ సినిమా భార‌త‌దేశంలో రిలీజైన అన్ని వెర్ష‌న్ల‌లో దాదాపు రూ.255కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప‌న్నుల బాదుడు మొత్తం స‌వ‌రిస్తే రూ.185కోట్ల నెట్ వ‌సూలు చేసింది. ఇంత‌వ‌ర‌కూ ఓ హిందీ సినిమా చేయ‌లేని మ్యాజిక్ ఇది. ఓ ప్రాంతీయ సినిమా సాధించిన అసాధార‌ణ విజ‌యం ఇది. అంతేనా ఈ సినిమా ఇప్ప‌టికే నైజాంలో అదిరిపోయే వ‌సూళ్లు తెచ్చింది. ఏడు రోజుల్లో దాదాపు 21కోట్లు వ‌సూలు చేసి దిల్‌రాజు పెట్టుబ‌డుల్ని వెన‌క్కి తెచ్చేసింది. సోమ‌వారంతో 22కోట్లు దాటుతుంది. అంటే ఇక నుంచి రాజుగారి కి అన్నీ లాభాలేన‌న్న‌మాట‌.

అలాగే అమెరికాలోనూ దాదాపు 6మిలియ‌న్ డాల‌ర్లు (60ల‌క్ష‌ల డాల‌ర్లు ) వ‌సూలు చేసి ఇంత‌వ‌ర‌కూ అక్క‌డ ఉన్న తొలివారం రికార్డుల‌న్నిటినీ కొట్టేసింది. అంతేనా అమెరికా బ‌య్య‌ర్ల‌కు దాదాపు పెట్టుబ‌డికి రెట్టింపు లాభాల్ని అందించింది. ఏపీలో సోమ‌వారం నాటికి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధ్య‌మ‌వుతుంది. ఇక అక్క‌డినుంచి వ‌చ్చేదంతా రాబ‌డేన‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.