English | Telugu

ముంబైలో ''బాహుబలి'' తొలి షో పడింది

తెలుగు సినీ చరిత్రలో ఇంకే సినిమాపైనా లేనంత హైప్‌ 'బాహుబలి' మీద క్రియేట్‌ అయ్యింది. మొదటిరోజే చూసేయాలనే ఉత్సాహంతో ఉన్న ప్రేక్షకులకోసం దాదాపు ప్రతీ టౌన్‌సిటీలోని అన్ని థియేటర్స్‌లో బాహుబలి షోస్ వేస్తున్నారని ట్రేడ్ వర్గాల కథనం. 'బాహుబలి' ఫస్ట్ షో మా దగ్గరంటే మా దగ్గరని సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 'బాహుబలి' ఫస్ట్ షో ఇండియాలో పడిపోయిందట. అది ఎక్కడో కాదు బాలీవుడ్ అడ్డా అయిన ముంబై లో 'బాహుబలి' ఫస్ట్ షో పడిందట.

''బాహుబలి'' హిందీ వర్షెన్‌ రైట్స్ సొంతం చేసుకున్న కరణ్‌ జోహార్ ఈ రోజు సాయంత్రం 8 గంటలకు బాలీవుడ్ లో తన సన్నిహితుల కోసం స్పెషల్ షో వేశారట. ఈ షో చూసిన ఇండస్ట్రీ పెద్దలు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. రానా నటనకైతే అందరూ ఫిదా అయిపోయినట్టు సమాచారం. మరోవైపు హైదరాబాద్ లో బాహుబలి ఫస్ట్ 12గంటలకు పడనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.